మహబూబ్ నగర్ లో కారు ఢీకొని తీవ్ర గాయాలపాలైన మహిళ స్థానిక ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించింది. మహబూబ్ నగర్ గ్రామీణ ఎస్ఐ రవి కథనం ప్రకారం. మహబూబ్నగర్ మండలం కోటకదిరకు చెందిన ఫకీరి కతాలమ్మ(61) మన్యంకొండ వద్ద ఉన్న అలువేలు మంగ దేవాలయం వద్ద నిద్ర చేయడానికి మంగళవారం రాత్రి వచ్చింది. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో రివర్స్లో వచ్చిన కారు గుడి ముందు నిద్రిస్తున్న ఆమె కాళ్ల మీదుగా వెళ్లింది. కుడికాలుకు తీవ్ర గాయం కాగా కారును నడిపిన వ్యక్తే మహిళను మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.