బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు.బుధవారం తమ్మినేని మాట్లాడుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.