రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు పడుతున్నాయి. ఆ విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలో కొత్త ఒరవడి తెచ్చారు. వినూత్న నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు.