ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్లో 274 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవన ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి మల్లారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చారిత్రక, వారసత్వ ప్రదేశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్ & ఎడ్యుకేషన్ సెంటర్, మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలను, 100, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపాలు, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి మరియు జలమండలి అధికారులు పాల్గొన్నారు