ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుద్ధవన ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 04:36 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్‌లో 274 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధ‌వన ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి మల్లారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చారిత్రక, వారసత్వ ప్రదేశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్‌ & ఎడ్యుకేషన్‌ సెంటర్‌, మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలను, 100, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపాలు, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి మరియు జలమండలి అధికారులు పాల్గొన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com