ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 04:11 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మిషన్ భగీరథ మంచినీటి సరఫరా, కరెంటు సింగిల్ ఫేస్ నుండి త్రీ ఫేస్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని స్థానిక కౌన్సిలర్ సాయి యాదవ్ తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com