హైదరాబాద్ లోని శంషాబాద్ లో తనకు ఇంచు భూమి కూడా లేదని ఎంపీ కె.కేశవరావు స్పష్టం చేశారు. తన పిల్లలు 2013 లో భూములు కొన్నది ఇబ్రహీంపట్నంలోనని వివరించారు. అది కూడా పత్రాలన్నీ సరిచూసుకున్నాకే కొనుగోలు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలన్నీ చూపించినప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలు ఇంకా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుకెళ్లి వివరాలు తీసుకోవచ్చని ఎంపీ కేకే సూచించారు.