యాదగిరి గుట్ట: శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గాయత్రి బంధువులు, ప్రజా సంఘాలు శ్రీకాంత్ ఇంటి వద్ద గాయత్రి మృతదేహంతో ధర్నాకు దిగాయి. శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసి నిప్పుపెట్టారు. కాగా కొద్ది సేపటి కిందట గాయత్రి బంధువులు తన ఆందోళన విరమించారు. గాయత్రి మృతదేహాన్ని ఆమె ఇంటికి తీసుకువెళ్లారు. మరి కొద్ది సేపటిలో ఆమె భౌతిక కాయానికి అంతర్యక్రియలు నిర్వహిస్తారు. ప్రేమను నిరాకరించిందని నిన్న యాదగిరి గుట్ట మండలంలో గాయత్రి అనే మహిళను శ్రీకాంత్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.