ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'మెయ్యజగన్'

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 03:42 PM

కోలీవుడ్ నటుడు కార్తీ తన 27వ సినిమాని C. ప్రేమ్ కుమార్‌తో  ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. మెయ్యజగన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని AP ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com