ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణబీర్ కపూర్ 'రామాయణం' ఈ తేదీన అనౌన్స్ కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 08:10 PM

అల్ట్రా-మాస్ యాక్షన్ డ్రామా యానిమల్‌తో ప్రేక్షకులను అలరించిన తరువాత రణబీర్ కపూర్ తన తదుపరి సినిమాని దంగల్ ఫేమ్ నితేష్ తివారీతో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా  రానున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు.


లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ నెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభమవుతుంది అని లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి భాగాన్ని 2025 దీపావళి వారాంతంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు లారా దత్తా వరుసగా హనుమంతుడు, శూర్పణక మరియు కైకేయిగా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com