ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు హక్కు ఉపయోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్...!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 11:11 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓటు వేశారు.
అల్లు అర్జున్ ఒంటరిగా వచ్చి ఓటు వేశారు. ఎన్టీఆర్ తన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అక్కినేని హీరో సుమంత్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com