లాస్ ఏంజెల్స్ లో మార్చి 12న జరిగిన 95వ అకాడెమీ అవార్డులలో పాల్గొన్న తదుపరి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆయన సతీమణి ఉపాసన ఈ రోజు ఇండియాకు తిరిగి వచ్చారు. ఐతే, అమెరికా నుండి డైరెక్ట్ హైదరాబాద్ కి కాకుండా, ఢిల్లీలో రాంచరణ్, ఉపాసన దిగారు. ఈ రోజు ఢిల్లిలో జరగనున్న ఇండియా టుడే కాంక్లేవ్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, తదితర ప్రముఖులతో పాటుగా రాంచరణ్ కూడా పాల్గొనబోతున్నారు.
ఆస్కార్ వేడుకల తరవాత తొలిసారి రాంచరణ్ ను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చూసిన అభిమానులు 'జై చరణ్' నినాదాలు చేస్తూ, ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. నాటు నాటు పాటను సూపర్ హిట్ చేసిన భారతీయులందరికీ ధన్యవాదాలు. ఇది మా ఒక్కరి పాటే కాదు.. అందరి పాటే. ప్రేక్షకాభిమానులే ఈ పాటను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు.. అంటూ చరణ్ వ్యాఖ్యానించారు.