ప్రామిసింగ్ నటుడు శర్వానంద్ నిశ్చితార్థం గత వారం రక్షిత రెడ్డితో జరిగింది. ఈ వేడుకకి ఫిలిం ఇండస్ట్రీ నుండి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఇప్పుడు, నటుడి కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. తాజా అప్డేట్ ప్రకారం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకుడు కెవి గుహన్తో ఈ హీరో తన తదుపరి సినిమాని చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ప్రకటించని ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెవి గుహన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నారు మరియు నటుడు తన కమిట్ అయిన ప్రాజెక్ట్లను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.