బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ "పఠాన్". షారుఖ్ ఖాన్ నుండి నాలుగేళ్ళ విరామం తరవాత వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకాభిమానుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ లో అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. అటు ఓవర్సీస్ లోనూ పఠాన్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లను రాబడుతుంది.
ఈ నేపథ్యంలో పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని పూల బొకేనిచ్చి, అభినందనలు తెలిపారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో మీడియాలో హల్చల్ చేస్తుంది.