శాండల్వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర అండ్ కిచ్చా సుదీప్ ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'కబ్జా' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్ సినిమాస్తో కలిసి కబ్జా తెలుగు డబ్బింగ్ వెర్షన్ను అందిస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని హీరో సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా ప్రకటించారు.
ఈ పాన్ ఇండియా మూవీలో మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 7 భారతీయ భాషల్లో విడుదల కానుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.