స్పెషల్ ఫ్యామిలీ ప్రీమియర్స్ తో ఆడియన్స్ లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన 'రైటర్ పద్మభూషణ్' చిత్రబృందం ఆపై టికెట్ రేట్లను ఫ్యామిలీ ఆడియన్స్ కు అనువుగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చి సినిమాపై క్రేజ్ మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రేపు పెయిడ్ ప్రీమియర్స్ జరగాల్సి ఉండగా, వాటికి ఆడియన్స్ నుండి విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే 3 ప్రీమియర్స్ టికెట్లు ఫుల్ గా సేల్ అయిపోగా, మిగిలిన షోలు ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయంటూ మేకర్స్ ఎనౌన్స్ చేసారు. దీంతో ఆడియన్స్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది.
సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసారు. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈనెల 3న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.