ప్రఖ్యాత అమెరికన్ దర్శకద్వయం రస్సో బ్రదర్స్ యొక్క ఇటాలియన్ సిరీస్ 'సిటాడెల్' కు ఇండియన్ ఇన్స్టాల్మెంట్ గా అదే పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సౌత్ హీరోయిన్ సమంత జంటగా నటించబోతున్నారు. అమెజాన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఇండియన్ ఇన్స్టాల్మెంట్ ను 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే డైరెక్ట్ చెయ్యబోతున్నారు.
సమంత తన అనారోగ్యం కారణంగా ప్రెస్టీజియస్ సిటాడెల్ వెబ్ సిరీస్ నుండి తప్పుకుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఐతే, తాజాగా సిటాడెల్ షూటింగ్ ను సమంత షురూ చేసిందని కాసేపటి క్రితమే ప్రైమ్ వీడియో సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.