ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ "అల వైకుంఠపురంలో" బాలీవుడ్ లో 'షెహజాదా' గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే కదా. హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రోహిత్ ధావన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పోతే, ఫిబ్రవరి 10వ తేదీన షెహజాదా మూవీ థియేటర్లకు రావాల్సి ఉండగా, విడుదల తేదీ ఒక వారం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 17న షెహజాద మూవీ థియేటర్లకు రాబోతుందని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఐతే, విడుదల వాయిదాకు గల కారణాలను మేకర్స్ మాత్రం వెల్లడించలేదు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె ల "పఠాన్" మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ వసూళ్లను రాబట్టడమే షెహజాద విడుదలకు వాయిదా అని ప్రచారం జరుగుతుంది.