హారి హరీష్ దర్శకత్వం లో హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "యశోద". శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈటీవీ తెలుగులో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది.