నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ : వీర సింహా రెడ్డి (సీనియర్ బాలయ్య) రాయలసీమకి దేవుడు లాంటి మనిషి. పులిచర్ల ప్రాంతానికి అండగా నిలబడుతూ.. సీమ మంచి కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు. అయితే, వీర సింహారెడ్డికి సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) అంటే ప్రాణం. ఆమె కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. కానీ భానుమతి మాత్రం వీర సింహారెడ్డి చావు కోసం ముప్పై ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు.. ఇస్తాంబుల్లో జయసింహా రెడ్డి (జూనియర్ బాలయ్య) తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈషా (శ్రుతి హాసన్)తో జయసింహా ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో జయసింహాకి తన తండ్రి వీర సింహారెడ్డి గురించి తెలుస్తోంది. అసలు తండ్రి కొడుకులు ఎందుకు దూరం అయ్యారు ?, ప్రాణంగా ప్రేమిస్తే.. చెల్లి మీనాక్షి, వీరసింహా రెడ్డిని ఎందుకు చంపాలి అనుకుంటుంది?... చివరకు వీర సింహారెడ్డి కథ ఎలా ముగుస్తుంది ?... జయసింహా రెడ్డి తన తండ్రి కోసం ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్లు: వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు పాత్రలు పోషించిన బాలయ్యబాబు ఈ సినిమాలో ఎప్పటిలాగే మాస్ యాక్టింగ్తో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇంటర్వెల్తో పాటు క్లైమాక్స్ వంటి కొన్ని ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య నటన సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు న్యాయం చేసింది. హనీ రోజ్ నటన చాలా బాగుంది. ఆమె మంచి నటి అని ఈ సినిమా నిరూపించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో తన కీలక పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ద్వితీయార్ధంలో ఒక ముఖ్యమైన సన్నివేశంలో ఆమె నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వరలక్ష్మి తన నిజస్వరూపాన్ని శరత్ కుమార్కి చెప్పే సన్నివేశంలో దునియా విజయ్ నటన బాగుంది. నవీన్ చంద్ర కూడా మరో కీలక పాత్రలో మెప్పించాడు. అలాగే మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఓవరాల్ గా బాలయ్య మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. బాలయ్య డ్యాన్స్ కూడా అద్భుతం.
మైనస్ పాయింట్లు: గోపీచంద్ మలినేని మంచి మాస్ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నప్పటికీ.. ఈ పవర్ ఫుల్ మాస్ డ్రామా స్లో నేరేషన్ తో కొన్ని చోట్ల పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దర్శకుడు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కంటెంట్ పరంగా, ఆర్టిస్టుల పరంగా ఆ ఎలిమెంట్స్ ని వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమా రేంజ్ ని తగ్గించాడు దర్శకుడు మలినేని గోపీచంద్. మొత్తానికి సినిమా నిండా యాక్షన్ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ యాక్షన్ ఉపయోగపడలేదు. అలాగే కథలోని మెయిన్ ఎమోషన్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు.
రేటింగ్ 3/5.