యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకునే జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుగుతుండగా భారీ పోరాట సన్నివేశాల కోసం రూ.40 కోట్లతో 4 సెట్లు రూపొందించినట్లు సమాచారం. దీని కోసం విదేశాల నుంచి ఫైటర్స్ ను రప్పించారట. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.