విశాల్ నటించిన కొత్త చిత్రం "లాఠీ". కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ గా 'కొమ్మా రెమ్మా' అనే రొమాంటిక్ మెలోడీ విడుదలైంది. విశాల్, సునయనల మధ్య చిత్రీకరించిన అందమైన ఈ డ్యూయెట్ సాంగ్ ను యువన్ శంకర్ రాజా స్వరపరచగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. యువన్ శంకర్ రాజా, రంజిత్, శ్వేతామోహన్ కలిసి పాడారు.
ఏ. వినోద్ కుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా నిర్మిస్తున్నారు. పోతే, ఈ రోజే టీజర్ కూడా విడుదల కాబోతుంది.