ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నేహా దేశ్ పాండే

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 11:18 AM

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన నటి నేహా దేశ్ పాండే. ఈ సందర్భంగా నేహా దేశ్ పాండే మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు మొక్కలు నాటడమే కాదు సందర్బం వచ్చినప్పుడల్లా మరిన్ని మొక్కలు నాటి సంరక్షిస్థానని అన్నారు.

ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనము కూడా తిరిగి ఎంతో అంత ఇవ్వాల్సిన భాద్యత లో భాగంగా మొక్కలు నాటి మంచి వాతావరనాన్ని కల్పించే అవసరం ఎంతయినా ఉంది అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా సోహెల్, సన్నీ, మోడల్ సాధన వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com