ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా లైగర్ అభిమానులను నిరాశపర్చగా, ఈ ఏడాది చివర్లో వస్తుందనుకున్న 'ఖుషి' కూడా వచ్చేలా లేదు. విజయ్, సమంత నటిస్తున్న 'ఖుషి' సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకు తీసుకొస్తామని ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు. షూటింగ్ 60 శాతం పూర్తయినా డిసెంబరులో విడుదలకు వీలుకావడంలేదని, ఫిబ్రవరిలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.