ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీడని ప్రత్యూష మరణం మిస్టరీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 11:02 AM
టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యూష మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ప్రత్యూష మరణం పై ఆమె తల్లి సరోజినీ దేవి ఆఫ్ రికార్డులో ఓ కీలక విషయం చెప్పారు. ఆమె ఏం అన్నారంటే.. “ప్రత్యూషను తన ప్రియుడు సిద్దార్దరెడ్డి అతని గ్యాంగ్ నాలుగైదు గెస్ట్ హౌజ్ లు మార్చి అత్యాచారం చేశారు. చివరికి ప్రత్యూష అపస్మారక స్థితికి వెళ్లడంతో సిద్దార్దరెడ్డిని వారు ముందేసి తప్పించుకున్నారు. సిద్దార్ద్ కూడా విషం తాగినట్టు నటించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కూతురిని మోసం చేశాడు. ప్రస్తుతం సిద్దార్డరెడ్డి పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాడు. అతని గ్యాంగ్ కూడా దర్జాగా బయట తిరుగుతుంది. నేను మాత్రం 20 ఏళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాను. కానీ నిందితులకు శిక్ష పడడం లేదు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో అప్పటి హోం మంత్రి కుమారుడి పై కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసు డిపార్ట్ మెంటే కేసును తప్పుదోవ పట్టించిందన్న విమర్శలు కూడా వచ్చాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com