బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ లోకి హీరోగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్వాతిముత్యం' తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె ని మూవీ మేకర్స్ సంక్రాంతికి విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. 2 నిమిషాల 9 సెకన్ల రన్ టైమ్ ని కలిగి ఉన్న ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా కనిపించనుంది. స్వాతిముత్యం సినిమా అక్టోబరు 5, 2022న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, సుబ్బరాజు, హర్షవర్ధన్, గోపరాజు రమణ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.