కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం "వారసుడు" (తమిళంలో "వారిసు"). వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రఖ్యాత ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిందట. తమిళ ఫిలిం ఇండస్ట్రీలోనే రికార్డ్ బ్రేకింగ్ ఎమౌంట్ తో ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని టాక్.
పోతే, ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.