నిన్న జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం సాధించడమే కాక, సిరీస్ ను కూడా కైవసం చేసుకుని, విజయోత్సాహంలో ఉంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అయిపోయిన వెంటనే హార్దిక్ పాండ్యా మరియు మరికొందరు క్రికెటర్లు కలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఏర్పాటు చేసిన పార్టీలో హార్దిక్ మరియు మిగిలినవారు ఎంజాయ్ చేసారు.
రాజమౌళి RRR తో గ్లోబల్ లెవెల్ గుర్తింపును సంపాదించిన చరణ్, పాపులారిటీలో నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నారు. త్వరలోనే శంకర్ "RC 15" తో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.