రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం "తెలిసినవాళ్ళు". కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.
విప్లవ్ కోనేటి రచించి, డైరెక్షన్ చెయ్యడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కొందరు కలిసి చంపుకుంటే అది మాస్ సూసైడ్, అలానే కొందరు కలిసి చావటానికి ఫిలాసఫీ ఉంటే అది కల్ట్ సూసైడ్... అనే డైలాగ్స్ సినిమాపై ఇంటరెస్ట్ ను తీసుకొస్తున్నాయి. నరేష్ చనిపోతే, ఆయన బతకాలని బలంగా కోరుకుంటూ హీరోయిన్ కుటుంబసభ్యులు అందరు ప్రాణత్యాగానికి సిద్ధమవుతారు..ఇలా చేస్తే ఆయన తిరిగొస్తారని వారి నమ్మకం. హీరోయిన్ ని ప్రేమించే హీరో వారి సూసైడ్ ను ఎలా ఆపాడు అనే నేపథ్యంలో టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది.
సిరంజ్ సినిమా బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను KSV సమర్పిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.