కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 42 మూవీలో హీరోయిన్ గా నటిస్తూ, బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని బిజీగా గడుపుతుంది. రీసెంట్గానే ఈ మూవీ షూటింగ్ గోవాలో మొదలవగా, ఆ షెడ్యూల్ లో సూర్య, దిశా మరియు తదితర కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఇంట్లో ఉన్న తన పెట్ బెల్లా ను మిస్ అయ్యానని ఫీల్ అవుతున్న దిశా బెల్లా తో దిగిన ఒక క్యూట్ సెల్ఫీ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ...మిస్సింగ్ యూ అంటూ కామెంట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న "ప్రాజెక్ట్ కే" లో దిశా పటాని కీలకపాత్రలో నటిస్తుంది.