వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న త్రిభాషా చిత్రం "సీతారామం". దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.
నిన్న విడుదలైన సీతారామం ట్రైలర్ కు యూట్యూబులో మంచి స్పందన వస్తుంది. 24 గంటల్లో సీతారామం ట్రైలర్ కు 5.23 మిలియన్ వ్యూస్, 173.2కే లైక్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఆగస్టు 5న తెలుగు, మలయాళం, తమిళ భాషలలో విడుదల కాబోయే ఈ మూవీకి విశాల్ చంద్ర సంగీతం అందించారు. ఇంకా ఈ సినిమాలో రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.