కోలీవుడ్, బాలీవుడ్ లలో మంచి గుర్తింపు ఉన్న సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు ఆర్. మాధవన్. కేవలం నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చిత్రసీమకు తన సేవలనందించాడు.
మాధవన్ నటించిన కొత్త సినిమా రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్. ఈ సినిమాకు మాధవన్ దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 1వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వరస ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై తగిన బజ్ క్రియేట్ చేస్తున్నారు.
రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ... తమిళ "మిన్నలే"(తెలుగులో చెలి) సినిమాకు హిందీ రీమేక్ గా తెరకెక్కిన, మాధవన్ బాలీవుడ్ డిబట్ ఎంట్రీ ఇచ్చిన "రెహ్నాహై తేరే దిల్ మే" చిత్రం రీమేక్ చేస్తే ఇప్పుడున్న హీరోహీరోయిన్లలో లీడ్ రోల్స్ లో ఎవరు నటిస్తే బావుంటుందని విలేఖరి ప్రశ్నించగా, మాధవన్ కొంచెంసేపు అలోచించి... కార్తీక్ ఆర్యన్, ఆలియాభట్ అని సమాధానమిచ్చారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా, ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మాధవన్ చెప్పిన సమాధానంతో, కార్తీక ఆర్యన్, ఆలియాభట్ కాంబోలో ఈ సినిమా రీమేక్ చేస్తే బావుణ్ణని బాలీవుడ్ జనాలు కోరుకుంటున్నారు.