ప్రముఖ టీవీ నటి రష్మీరేఖ ఆత్మహత్య చేసుకుంది. ఒడిశాలోని భువనేశ్వర్లోని గాడ్సాహి ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఆమె శవమై కనిపించింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని, ఆమె మృతికి అతడే కారణమని అనుమానిస్తున్నారు. రష్మితంద్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.