అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా 2' సినిమా మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తీక్ సరసన బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తుంది. ఈ సినిమా భూల్ భూలయ్యా (2007)కి సీక్వెల్, ఇది చంద్రముఖికి రీమేక్. ఈ సినిమా ఇప్పటివరకు బాక్స్ఆఫీస్ వద్ద 180 కోట్ల మార్కును క్రాస్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం జూలై 19న ప్రసారానికి అందుబాటులోకి రానుంది నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ సినిమాలో టబు, రాజ్పాల్ యాదవ్ అండ్ సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ అండ్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని అండ్ క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.