టాలీవుడ్ దర్శకుల్లో వేగంగా, మంచి కంటెంట్ ఉండే సినిమాలు చేసే దర్శకుడిగా పూరి జగన్నాధ్ కు మంచి పేరుంది. ఏ స్టార్ హీరోతో సినిమా అయినా నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేసేస్తుంటాడు. అలాంటి పూరి లైగర్ మూవీ కోసం నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తుంది. ఇందుకు కారణం కరణ్ జోహార్ అంట.
విషయమేంటంటే, పూరి డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఈ మూవీ షూటింగును పూరి గతేడాది నవంబర్ లోనే ఫినిష్ చేసారు. లైగర్ ఆగస్టు 25న విడులవుతుందని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా లైగర్ ను రిలీజ్ చెయ్యటానికి పూరి 9నెలల పాటు ఎదురుచూస్తున్నాడు. సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కరణ్ జోహార్ అని తెలుస్తుంది. ఒక నిర్మాతగా ఈ మూవీలో కరణ్ ఎక్కువగా ఇన్ వాల్వ్ అయ్యారని, సినిమాను భారీ రేంజులో విడుదల చెయ్యటానికి తగిన ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. విజయ్ దేవరకొండ పేరును ది విజయ్ దేవరకొండ అని మార్చి మరీ కరణ్ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. పూరి స్ట్రాటజికి పూర్తి విభిన్నంగా , బాలీవుడ్ స్ట్రాటజీ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న లైగర్ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.