అడవి శేష్ లీడ్ రోల్ లో నటించిన "మేజర్" మూవీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అవ్వడమే కాక దేశప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. మేజర్ చూసిన ప్రతిఒక్కరూ భావోద్వేగానికి లోనై, కంటతడి పెట్టుకుంటున్నారు. వీరిలో సామాన్య ప్రజలు , సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మేజర్ పై దిగ్గజ సినీ సెలెబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ లో అల్లు అర్జున్, హీరో నిఖిల్, అనుష్క శెట్టి లాంటి వారు మేజర్ ను ఆకాశానికి పొగిడేస్తే, తాజాగా ఈ లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు. మేజర్ సినిమాను తన బిజీ షెడ్యూల్ వల్ల ఇంకా చూడనప్పటికీ దేశవ్యాప్తంగా వస్తున్న స్పందనను చూసి పవన్, మేజర్ పై ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధీరోదాత్తత ను దేశప్రజలకు చూపించినందుకు మేజర్ మూవీ టీం కు పవన్ కృతజ్ఞతలు తెలియచేసారు. మేజర్ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరిస్తున్నందుకు, విడుదలైన అన్ని భాషల్లో విజయభేరి మోగిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుత స్థితిగతులపై అడవిశేష్ కు మంచి అవగాహన ఉందని, అది అతని మాటల్లో క్లియర్ గా కనిపిస్తుందని, శేష్ కు పవన్ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియచేసారు. అలానే డైరెక్టర్ శశికిరణ్ తిక్కా, ప్రకాష్ రాజ్, రేవతి మిగిలిన నటీనటులకు,నిర్మాతలు మహేష్ బాబు, అనురాగ్, శరత్ లకు పవన్ శుభాకాంక్షలను తెలియచేసారు.