బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్, తన కొత్త చిత్రం "కభీ ఖుషి కభీ దివాళి" చిత్రీకరణలో భాగంగా, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ఖరీదైన హోటల్ లో నివాసముంటున్నారు. ఈ మధ్య సల్మాన్, ఆయన తండ్రి పై చంపేస్తామంటూ ఆగంతకులు చేసిన బెదిరింపులు తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ముంబై పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసాయి. ఇలాంటి బెదిరింపుల మధ్య సల్మాన్ హైదరాబాద్ లో దాదాపు నెలపాటు సాగే చిత్రీకరణలో పాల్గొననున్నారు. హైదరాబాద్ లో తాను ఉంటున్న హోటల్లో సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటూ భోజనం చేస్తున్న సల్మాన్ పిక్చరొకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా, వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే కనక ఎప్పుడో హిందీ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వెంకటేష్ కు ఈ సినిమా రీఎంట్రీ సినిమా అవుతుంది. ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.