తెలుగు స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో ఒకటి అని చెప్పొచ్చు. టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున బిగ్బాస్ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ మొదటి సీజన్లో బిందుమాధవి గెలిచి బిగ్ బాస్ మొదటి లేడీ విజేతగా నిలిచింది. అరియానా పది లక్షల తీసుకుని షో నుండి వాకౌట్ చేయడంతో షోలో విన్నర్ కి 40 లక్షల ప్రైజ్ మనీ వచ్చిందని అందరికి తెలిసిన విషయమే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇప్పటికే షోలో భాగం కావడానికి బిందుకి దాదాపు 60 లక్షలు మేకర్స్ చెల్లించినట్లు టాక్. ఈ షో ద్వారా బిందు కోటి రూపాయలకు పైగా సంపాదించింది. త్వరలో ఈ గ్లామర్ బ్యూటీ నటసింహ బాలయ్య తదుపరి సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.