టాలీవుడ్, బాలీవుడ్ లలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన నుండి సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోతున్నాయి. 2020 లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆయన చివరి చిత్రం. అప్పటి నుండి వరస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి వాటి షూటింగులతో విజయ్ బిజీగా ఉన్నాడు. రెండేళ్ల విరామం వచ్చినా కానీ, ఈ గ్యాప్ ను విజయ్ భారీగానే భర్తీ చేయనున్నాడు. లైగర్ పాన్ ఇండియా మూవీతో భారీ సక్సెస్ ను కొడతాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు విజయ్. అలానే శివ నిర్వాణ డైరెక్షన్లో ఈ మధ్యనే ఖుషి అనే సినిమాను స్టార్ట్ చేసి తొలి షెడ్యూల్ ను రీసెంట్గా పూర్తి చేసాడు. ఈ సినిమా కన్నా ముందే పూరీతో JGM (జనగణమణ) స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే విజయ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను తీసుకొచ్చాడు. ఇలా వరస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ తాజాగా మరొక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.
విజయ్ కున్న క్రేజ్ కు, ఫాలోయింగ్ కు ఆయన స్టార్ డైరెక్టర్లతో పని చెయ్యొచ్చు. కానీ ఒక ఫేడౌటైన దర్శకుడికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయనెవరో కాదు... అష్టాచెమ్మా ఫేమ్ ఇంద్రగంటి మోహన కృష్ణ. ప్రెజెంట్ ఫామ్ లో లేకపోయినా ఇంద్రగంటి సినిమాలు ఫామిలీ ఆడియన్స్ ని, థియేటర్లకు రప్పించడంలో ముందుంటాయి. సెన్సిటివ్ స్టోరీలను స్క్రీన్ పై హృద్యంగా చూపించగల ట్యాలెంట్ ఆయన సొంతం. ఆయన పనితనం మీద ఉన్న నమ్మకంతోనే విజయ్ ఇంద్రగంటికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంద్రగంటి సుధీర్ బాబు తో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో యంగ్ హీరోయిన్ కృతిశెట్టి హీరోయిన్.