తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.రామకృష్ణారెడ్డి (76) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిమానవంతులు, వైంకుఠపాలి, అల్లుడు గారు జిందాబాద్, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, సీతాపతి సంసారం, అగ్ని కెరాటాలు వంటి సినిమాలకు రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ బ్యానర్ పై ఆయన సినిమాలను నిర్మించారు.