బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాగ్నమ్ ఓపస్ 'పృథివీరాజ్' సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు యోధ రాజుగా ప్రధాన పాత్ర పోషించడానికి అక్షయ్ సెట్ కాదని పలువురు భావించడంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్కు గురైంది. తాజా అప్డేట్ ప్రకారం, అక్షయ్ ఈ సినిమాకి 60 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సాధారణంగా 100 కోట్లులకి దగరలో రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ ఈ సినిమాకు 60కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా డల్ బజ్ ఉంది మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత వరకు రాబడుతుందో వేచి చుడాలిసిందే.