అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా 2' సినిమా మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తీక్ సరసన బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తుంది. ఈ సినిమా భూల్ భూలయ్యా (2007)కి సీక్వెల్, ఇది చంద్రముఖికి రీమేక్. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 56 కోట్లు వసూలు చేసింది. వచ్చే వారం చివరి నాటికి ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుతుంది అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో టబు, రాజ్పాల్ యాదవ్ అండ్ సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ అండ్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని అండ్ క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.