చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కార్తికేయ 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఈ మిస్టరీ థ్రిల్లర్ కోసం నిఖిల్ హిందీలో డబ్ చేయబోతున్నాడు అని లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీలో జూలై 22, 2022న థియేటర్లలో విడుదల కానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.