కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ సునైనా చివరిసారిగా తెలుగులో 'రాజా రాజా చోరా' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న 'లాఠీ' సినిమాతో పాటుగా పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఆమె నటిస్తున్న 'రెజీనా' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అని సమాచారం. థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న సినిమా గతంలో తనను బాధపెట్టిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న గృహిణి కథగా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీకి నిర్మాత సతీష్ సంగీతం అందిస్తున్నారు. ఎల్లో బేర్ ప్రొడక్షన్ పతాకంపై సతీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.