అమరావతి : హైదరాబాద్ లో పన్ను కట్టే వారిలో 40 శాతం మంది ఆంధ్రప్రదేశ్ వారే నని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కలిసి కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో పన్ను కట్టే ఆంధ్రావారంతా ఏపీకి వచ్చేస్తే ఇక్కడ ఆర్థిక సమస్య అనేదే ఉండదని వ్యాఖ్యనించారు. అప్పుడు సహాయం కోసం ఎదురు చూడటం కాదు…ఏపీయే ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.