ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిపత్రిలో వినూత్నంగా పందుల పందేలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2018, 03:23 PM

సంక్రాంతి పండగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. అదే, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం వినూత్నంగా పందుల పందేలు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వరాహాలను తీసుకుని వాటి యజమానులు ఇక్కడికి తరలివచ్చారు. మహబూబ్ నగర్, గద్వాల్, హిందూపురం, కల్యాణదుర్గం, కడప, బేతెంచర్ల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 మంది తమ వరాహాలను తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ పోటీ జరిగే తీరు ఎలా ఉంటుందంటే.. రెండు వరాహాలు సుమారు అరగంటకు పైగా తలపడతాయి. ఈవిధంగా నిర్వహించే పోటీలో విజయం సాధించిన వరాహాన్ని విజేతగా ప్రకటించి, దాని యజమానికి నగదు బహుమతిని అందజేస్తారు. వినూత్నంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను చూసేందుకు తాడిపత్రి వాసులతో పాటు, సమీప, దూర ప్రాంతాల వారు అధిక సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com