ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం కొన్ని దేశాల నోర్లు మూయించాలన్న ఉద్దేశంతో చైనా దేశం వ్యూహాత్మకంగా ఆయా దేశాలలో పెట్టుబడులను పెట్టింది. ఇండోనేసియాలో 44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన బీజింగ్.. సింగపూర్లో 41 బిలియన్ డాలర్లు, రష్యాలో 39 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియాలో 33 బిలియన్ డాలర్లు, మలేసియాలో 30 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. తైవాన్ ఆక్రమణ ప్రయత్నాలు, దక్షిణ చైనా సముద్రంలో తమ పెత్తనం విషయంలో ఏసియన్ దేశాలు నోరు మెదపకుండా ఉండటం కోసం.. కంబోడియాలోనూ చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది.
చైనా బీఆర్ఐ ఎఫెక్ట్ కేవలం భారత ఉపఖండానికి చెందిన దేశాలు, ఆసియా దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆఫ్రికాపైనా ప్రభావం చూపింది. కెన్యాలో 4.7 బిలియన్ డాలర్ల రైల్వే ప్రాజెక్టును చైనా అర్ధంతరంగా నిలిపేసింది. ఉంగాడా, కెన్యాలను ఇది కలపాల్సి ఉండగా.. గమ్యానికి 200 మైళ్ల దూరంలోనే ఈ ప్రాజెక్టును ఆపేయాల్సి వచ్చింది. చైనా ఆర్థిక ఇబ్బందులు, ప్రపంచ దేశాలకు వాస్తవం బోధపడుతుండటంతో.. బీఆర్ఐ అనేది అగమ్యగోచరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.