ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 05:19 PM

వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు రాజ్యసభ సిద్దమవుతోంది. భారత ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడి పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ అయిన రాజ్యసభలో నేడు (సోమవారం) వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. 


ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక మెమొంటో ప్రదానం చేయనున్నారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీ కాలానికి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేటి రాత్రి ఫేర్ వెల్ డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యులు అందరూ హాజరుకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com