ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలను సరిదిద్దాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:27 AM

విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్య లోపాలతో మగ్గుతోంది. భయంకర కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం, గుండ్లకొండ గ్రామానికి చెందిన సుంకన్న ఆరోగ్యశ్రీ పథకం అనుమతుల కోసం ఎదురుచూసి ప్రాణాలు విడవడం శోచనీయం. 15 రోజులకు పైగా ఆరోగ్యశ్రీ అనుమతుల కోసం సుంకన్న కాళ్ళరిగేలా తిరిగినా కూడా అధికారులు స్పందించకపోవడంతో ఒక నిండు ప్రాణం బలయ్యింది. కార్పొరేట్‌ ఆసుపు్తల్ర నిర్లక్ష్యాలకుతోడు సకాలంలో ఆరోగ్యశ్రీ సేవలందక రాష్ట్ర వ్యాప్తంగా సుంకన్నలాంటి పేదలు వేల సంఖ్యలో ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. సుంకన్న మృతిపై ప్రత్యేక దర్యాప్తు జరపి చర్యలు చేపట్టాలని డిమాండ్గ చేస్తూ పరిష్కారం కోసం మీ దృష్టికి తీసుకువస్తున్నామని ఆరోగ్య శాఖా మంత్రి, డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌కి ఇచ్చిన వినతిప్త్రంలో కోరినట్లు ఓ ప్రకటనను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఆరోగ్యశ్రీలో లొసుగుల ఫలితంగా పేదల ఆరోగ్యం గాల్లో దీపంలా మారిపోయింది. ఇక ప్రభుత్వ ఆసుపు్తల్రలో రోగి జబ్బును నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు చేసే సౌకర్యాలే లేవు. జబ్బులను నిర్ధారించడానికి స్పెషలిస్టు వైద్యులు లేరు. ``ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యత'గా గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం లోపభూయిష్టమైన నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం పేద, సామాన్యులందరికీ వర్తించే విధంగా,  వైద్యపరీక్షలన్నీ ఉచితంగా చేయడంతోపాటు, మెరుగైన వైద్యం అందించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ ఆసుపు్తల్రలో వైద్య సౌకర్యాలు, వసతులు మెరుగుపరచాలి. ప్రాణం విలువను కాగితాలపై రాతలుగా మిగల్చకుండా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు చేయాలని, సుంకన్న మరణంపై దర్యాప్తు జరిపించాలని, అందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా  కోరుతున్నామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com