కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీనిపై ఆయన స్వయంగా శనివారం ట్వీట్ చేశారు. 'కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు నాకు పాజిటివ్గా తేలింది. దీంతో నేను ఐసోలేట్ అయ్యాను. గత కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నవారు, దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. వెంటనే క్వారంటైన్ అవండి. కోవిడ్ వల్ల నా ఢిల్లీ పర్యటన రద్దయింది." అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.