ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకన్న సన్నిధిలో ఉచితంగా అన్నపానీయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:15 AM

-ఇతర ప్రాంతాల్లో భోజన వితరణ ేకంద్రాలు
-టీటీడీ వైద్య ేకంద్రాల వద్ద అన్న ప్రసాదాలు
-జలప్రసాదం పేరిట తాగునీటి ేకంద్రాలు
తిరుమల నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : వేసవికాలంలో వెంకన్న దర్శనం కోసం వస్తున్న భక్తుల ఏర్పాట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల శ్రీనివాసుని సన్నిధికి విచ్చేసే యాత్రికులందరికీ అన్నప్రసాదాలు అందించేలా టీటీడీ చర్యలు ప్రారంభించింది. అన్నప్రసాద సముదాయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా భోజన సౌకర్యం కల్పిస్తూ వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భక్తులు ఆహారం కోసం హోటళ్ల వైపు చూడకుండా కడుపు నిండా భోజనం చేసే వెసులు బాటు కల్పిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా కదిలే అన్న ప్రసాద వితరణ కేంద్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది.  కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 1984లో అన్న ప్రసాద వితరణను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. తొలుత రెండు వేల మందితో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కాలానుగుణంగా ఎన్నో మార్పులను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా నిత్యం వేలాది మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, తిరుపతిలోని యాత్రికుల వసతి సముదాయాలతో పాటు టీటీడీ వైద్యకేంద్రాల వద్ద కూడా అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు. గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారికి మాత్రమే టోకెన్ల ద్వారా అన్నప్రసాదాలు అందజేసేవారు. తరువాత కాలంలో అన్నప్రసాద భవనంలో, కంపార్ట్‌ మెంట్లో్ల వితరణ చేసేవారు. ప్రస్తుతం కొండపైకి వచ్చే వారందరికీ అన్నపానీయాలు అందించేందుకు చర్యలు ప్రారంభించారు. తిరుమల కొండపై యాత్రికులందరికీ అన్ని వసతులు ఉచితంగా అందజేయాలనే ఆలోచనతో ఈవో సాంబశివరావు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భక్తులకు ఉచితంగా త్రాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ, పిల్లలకు పాలు ఉచితంగా అందజేయాలని సంకల్పించారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువస్తున్నారు. తొలుత శుద్ధమైన త్రాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో జలప్రసాదం పేరిట త్రాగునీటి కేంద్రాలను ప్రారంబించారు. అలిపిరి తనిఖీ కేంద్రం మొదలుకుని కొండపైగల అన్ని ప్రదాన ప్రాంతాలలో 15 శుద్ధినీటి యంత్రాలను ఏర్పాటు చేశారు. త్రాగునీటి కేంద్రాల ద్వారా శ్రీవారి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో అన్నపానీయాలు అందజేయడానికి సకల్పించారు.


    ఇందుకోసం ప్రత్యేకంగా మూడు కదిలే అన్నప్రసాద  కేంద్రాలను తయారు చేయించారు. రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని వితరణ ప్రారంభించారు. తొలుత మధ్యాహ్న భోజనంతో ప్రారంభించి భక్తులకు ఉపయోగకరంగా ఉండడంతో ప్రస్తుతం మూడుపూటలా ఈ కేంద్రాలద్వారా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారంతో పాటు పానియాలను ఉచితంగా అందిస్తున్నారు. రాత్రి సమయాల్లో సాంబారు అన్నం, కిచిడీ లాంటి పదార్థాలను వడ్డిస్తున్నారు.
              రాంబగీచా, సీఆర్‌వో, యాత్రికుల వసతి సముదాయం వద్ద ప్రస్తుతం ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  అన్న ప్రసాదాలను స్వీకరించిన యాత్రికులు చేతులు కడుక్కోవడానికి, తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించారు. ఎక్కడా అపరిశుభ్రవాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com